Saturday, May 4, 2024

మరో రూ. 250 కోట్ల పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

ముందుకొచ్చిన వెల్ స్పన్ గ్రూప్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్ స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం డా.బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో వెల్ స్పన్ గ్రూప్ చైర్మన్ బి.కె. గోయెంకా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందు కు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ సహాయ, సహకారాలు ఎ ప్పుడు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. సిఎంతో సమావేశం అనంతరం వెల్ స్పాన్ గ్రూప్ చైర్మన్ బి.కె. గోయెంకా మాట్లాడుతూ తమ కంపెనీ భవిష్యత్‌లో చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించబడిన ఐటి సేవల్లో రూ.250 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. టైర్ 2, 3లలోని ఐటిలను అభివృద్ధి చేసి వాటిని ప్రమోట్ చేసేందుకు వికారాబా ద్, అదిలాబాద్ జిల్లాల్లోని యువతకు ఐటి ఉద్యోగాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, స్పెషల్ సెక్రటరీ డాక్టర్ విష్ణు రెడ్డి, సి ఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, వెల్ స్పాన్ గ్రూప్ హెడ్ (కార్పొరేట్ వ్యవహారాలు) చింతన్ థాకర్, శ్రీస భార్గవ మొవ్వ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News