- Advertisement -
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. కరోనా కేసుల దృష్టా పది పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. తాజాగా పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..’పదో తరగతి విద్యార్థులందరనీ పాస్ చేస్తున్నాం. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. హాల్టికెట్ పొందిన 6.3లక్షల పది విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాం. ఇంటర్ అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నాం. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు రీఫండ్ చేస్తాం. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులను పాస్ చేస్తున్నాం’ అని మంత్రి వెల్లడించారు.
AP 10th Class Exams 2020 Cancelled
- Advertisement -