Wednesday, May 15, 2024

ఎపిలో పెరిగిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 1257 new corona cases in 24 hrs

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,479మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 1257 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇదే సమయంలో కరోనాతో మరో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో ఇప్పటివరకు ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 20,77,486కు చేరుకుంది. ఇక, కరోనా వైరస్ బారిన పడి 14,497మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 130 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 20,61,729మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఎపిలో 4,774 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.

AP Reports 1257 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News