Sunday, April 28, 2024

‘ఖుషి’ నుంచి ‘ఆరాధ్య’ పాట విడుదల

- Advertisement -
- Advertisement -

డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అంటూ ప్రేమికులందరినీ కట్టిపడేశారు మేకర్లు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ఇప్పుడు ప్రేమికుల గీతంగా నిలిచిపోయేలా ఉంది.

ఆరాధ్య అంటూ సాగే ఈ పాటను శివ నిర్వాణ తెలుగులో రాయగా.. తమిళంలో మదన్ కార్కీ సాహిత్యాన్ని అందించాడు. తెలుగు, తమిళంలో సిధ్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ శ్రోతలకు వినసొంపుగా ఉంది. ఈ పాటలో సమంత, విజయ్ కెమిస్ట్రీ మరింతగా హైలెట్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ పాటలో శివ నిర్వాణ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ అంతా ఫిదా కానున్నారు. ఇప్పటికే ‘నా రోజా నువ్వే’ అనే పాట యూట్యూబ్‌లో వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌ ‘ఆరాధ్య’తో మరో సారి ‘ఖుషి’ సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరనుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News