Sunday, April 28, 2024

పాక్ రేంజర్ల కాల్పుల్లో జవాను మృతి

- Advertisement -
- Advertisement -

Army jawan killed 2 injured in Pakistani firing

కాశ్మీర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాల కాల్పులు జరిపాయి. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను మృతి చెందగా… మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత ఆరు రోజులుగా పూంచ్ సెక్టార్ లో పాకిస్థాన్ ఇలాంటి ఘటనలకు పాల్పడుతూనే ఉంది. జూన్ 10వ తేదీ వరకు పాక్ మొత్తం 114 సార్లు కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించినట్టు అధికారులు తెలిపారు. పాక్ చర్యలను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది.

Army jawan killed 2 injured in Pakistani firing

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News