Thursday, May 16, 2024

మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాల వారీగా సంబంధిత అధికారులతో చర్చించారు. ఇందుకు సంభంధించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. ఇదివరకు జాతరకు రెండు నెలల ముందే జరిగిన కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ సారి జాతర సమయంలోనే జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని మంత్రి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపి మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి చేద్దామని, తద్వారా రాష్ట్ర బడ్జెట్ కు కేంద్ర నిధులు తోడై జాతరను మరింత ఘనంగా నిర్వహించుకుందామని మంత్రి చెప్పారు. వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటిడిఎ అధికారులు అందరితో సమీక్ష నిర్వహించి జాతర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లివంటిదని, ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని సీతక్క భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు, శాఖ అదనపు సంచాలకులు విట్టా సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శంకర్, ట్రైకార్ జిఎం శంకర్, టిఆర్‌ఐ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Sitakka 2

sitakka 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News