Monday, April 29, 2024

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of cricket betting operators

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.65,000 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సయిద్ కుతూబుద్దిన్, ఎండి సుల్తాన్, ఎస్‌కె ఇర్ఫాన్ కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానబూకీ రహ్మత్ ఖాన్ పరారీలో ఉన్నాడు. ఐపిఎల్ క్రికెట్‌పై చాలామంది అభిమానులు ఆసక్తి చూపడంతో సులభంగా డబ్బులు వస్తాయని ప్లాన్ వేశారు. ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News