హైదరాబాద్: వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటూ వ్యభిచారం చేస్తున్న ఇద్దరు టాంజానియా దేశస్థులను మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో వారిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. టాంజానియా దేశం, డేర్స్సలాం, సినాజాకినోన్డోనికి చెందిన డయానా, కాబన్గిలా వారెన్ స్టూడెంట్ వీ సాపై ఇండియాకు వచ్చారు. ఇద్దరు కలిసి మాల్కాజ్గిరి, నేరెడ్మెట్, జికె కాలనీలో ఉంటున్నారు. ఇద్దరి వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్నారు. స్టూడెంట్ వీసాపై వచ్చిన ఇద్దరు తార్నాకలో ఉంటూ ఓయూ క్యాంపస్లో డిగ్రీ పూర్తి చేశారు. రెండు నెలల క్రితం నేరెడ్మెట్కు మారారు, ఇంటి యజమానికి తాము భార్యభర్తలమని చెప్పారు.
మీట్ 24 యాప్లో సెమీ న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేశారు. అందులో నుంచి విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం చేస్తున్నారు. కస్టమర్లతో రొమాంటిక్గా ఛాటింగ్ చేస్తూ వారిని ఆకర్షించేది, అంతేకాకుండా తన ఫొటోలను పంపించేది. వారిని తన ఇంటికే రప్పించేది, వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకునేది. దీనికి అతడి స్నేహితుడు వారెన్ అన్ని సౌకర్యాలు సమకూర్చేవాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నారు. వారి వీసాను పరిశీలించగా గడువు ఎప్పుడో ముగిసింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజ్గిరి పోలీసులు తెలిపారు. ఇన్స్స్పెక్టర్లు నవీన్కుమార్ తదితరులు పట్టుకున్నారు.