Tuesday, April 30, 2024

మహిళా పిసిని వివాహం చేసుకుని మోసం చేసిన యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of young man who cheated by Marrying Woman PC

మనతెలంగాణ, హైదరాబాద్ : మహిళా కానిస్టేబుల్‌ను వివాహం చేసుకుని మోసం చేసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరంలోని ఎఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంధ్యారాణిని షాబాద్‌కు చెందిన చరణ్‌తేజ వివాహం చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు ఆమెను వేధింపులకు గురిచేయడమే కాకుండా కులం తక్కువ అంటూ దూషించేవాడు. అంతేకాకుండా ఆమెను విడిచిపెట్టి వేళ్లిపోయాడు. తాజాగా ఆమెపై పలు ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చాడు. గతంలో సంధ్యారాణికి వివాహం అయిందని వాటిని దాచిపెట్టి తనను మోసం చేసిందని ఆరోపించాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై అట్రాసిటీ కేసు, 498,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News