Tuesday, May 7, 2024

ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత కరెంట్

- Advertisement -
- Advertisement -

Arvind Kejriwal promises 300 free electricity

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒక ప్రధాన ప్రకటనతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పంజాబ్ లో పర్యటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంజాబ్‌లోని ప్రతి కుటుంబానికి 300 యూనిట్లు వరకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో పాటు సౌరవిద్యుత్ బకాయిలు రద్దు చేస్తామని చెప్పారు. 24గంటల కరెంట్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. “మేము ఇక్కడ మూడు ప్రధాన పనులను చేస్తాము. మొదట, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తాము. రెండవది, పెండింగ్‌లో ఉన్న అన్ని విద్యుత్ బిల్లులు మాఫీ చేయబడతాయి. ప్రజల కనెక్షన్ పునరుద్ధరించబడుతుంది. మూడవది, 24-గంట విద్యుత్ సరఫరా చేయబడుతుంది” అని కేజ్రీవాల్ చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రసంగించిన ఆప్ జాతీయ కన్వీనర్ రెండు నెలల తర్వాత వచ్చి నిరుద్యోగుల కోసం కొత్త విధానాన్ని ప్రకటిస్తానని చెప్పారు. కాగా, 177 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ లో 77 సీట్లతో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, 20 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది.

Arvind Kejriwal promises 300 free electricity

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News