న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ఇంకా సమసి పోలేదని, కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కొవిడ్ నిబంధనలు పాటించడంలో నిర్లక్షం చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. కొవిడ్ విజృంభణపై ఢిల్లీ ఎల్జి అనిల్ బైజల్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్లతో మంగళవారం ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల సంఖ్య తగ్గినా ఎలాంటి పరిస్థితుల్లోనూ విశ్రమించకూడదని , కరోనాపై ఒకటిన్నరేళ్లుగా మనకున్న అనుభవం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ఆరు నెలలుగా వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉండడం, ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకోవడం, కరోనా నిబంధనలు పాటించడం ద్వారా కొవిడ్పై పోరులో మనం విజయం సాధించ వచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
Second wave of Covid-19 is still not over