Wednesday, May 15, 2024

36 పరుగులకే కుప్పకూలిన టీమిండియా… ఆసీస్ లక్ష్యం 90

- Advertisement -
- Advertisement -

Australia target is 90 runs in Ind vs aus First test

అడిలైడ్: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కుప్పకూలింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేయడంతో 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 36 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తొమ్మిదో వికెట్ పై షమీ గాయపడడంతో డిక్లేర్డ్ చేసింది.  భారత్ బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చటేశ్వరా పూజారా, అజింక్య రహానే పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హజిల్ వుడ్ ఐదు వికెట్ల పడగొట్టగా కమ్నీస్ నాలుగు వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేయగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు మాత్రమే చేసింది.

1955లో ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ 26 అతి తక్కువ పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గతంలో 1974 లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ పై భారత జట్టు 42 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News