- Advertisement -
ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు కోటి దాటాయి. అమెరికా తరువాత భారత్ రెండో స్థానంలో ఉండగా రోజు వారి పాజిటివ్ కేసుల సంఖ్యలో దేశం అనసరిస్తోంది. 24 గంటల్లో దేశంలో 11.71 లక్షల మందికి టెస్టులు చేయగా 25,152 మంది కరోనా వైరస్ సోకగా 347 మంది చనిపోయారు. కరోనాతో ఇప్పటివరకు 1.45 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 95.5 లక్షల మంది కోలుకోగా 3.08 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 16 కోట్ల మందికి టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 1.78 కోట్లకు చేరుకోగా 3.2 లక్షల మంది చనిపోయారు.
- Advertisement -