Friday, May 17, 2024

ప్రేమ వివాహం…. నడిరోడ్డుపై భార్యను నరికిన భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమ వివాహం చేసుకున్న యువతి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విడాకులు ఇస్తానని చెప్పడంతో ఆమెను భర్త హత్య చేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్ల పాలెం రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గణపవరం మండలం దువ్వారపు గ్రామానికి చెందిన చంటి (26), మొయ్యురు గ్రామానికి చెందిన చంద్రిక (24) ప్రేమించుకున్నారు. 2014లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. చంటి ప్లాటు కొనుక్కుంటానంటే ఐదు లక్షల రూపాయలు అతడికి చంద్రిక తల్లిదండ్రులు ఇచ్చారు. గత ఆరు నెలల నుంచి దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. కొమ్ము జెల్సీ అనే వ్యక్తి పరిచయం కావడంతో చంద్రిక అతడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు చంటికి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో గణపవరం పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసేందుకు ప్రియుడితో కలిసి చంద్రిక  బైక్ పై గొల్లగూడెం నుంచి మొయ్యేరుకు వెళ్తుండగా విషయం తెలిసిన భర్త మరో ఇద్దరు కలిసి మార్గం మధ్యలో కాపు కాశారు. పెంటపాడు- జట్లపాలెం మార్గంలో వెళ్తుండగా మాట్లాడుదామని చంద్రికను చంటి ఆపాడు. ముగ్గురు కలిసి జెల్సీపై దాడి చేయగానే పారిపోయి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చంద్రికను చంటి కత్తితో పలుమార్లు నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News