Wednesday, May 8, 2024

ఆటోను ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌ మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని కొత్తగూడెం చౌరస్తాలో వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ సంఘటనాస్థలంలోనే మృతిచెండాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఉత్తటూరు గ్రామానికి చెందిన శ్రీశైలంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

Auto Driver died after Car hits in Abdullapurmet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News