Monday, April 29, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ జిల్లా చక్రతా తహసీల్‌లోని బుల్హాద్-బైలా రోడ్డు వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది.ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్‌డిఆర్ఎఫ్ సిబ్బంది, చక్రతా పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

11 killed in Road Accident in Dehradun

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News