Tuesday, April 30, 2024

పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: రెండేళ్ల పాప పాఠశాల బస్సు కిందపడి మృతిచెందిన సం ఘటన హబ్సిగూడలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… హబ్సీగూడ రవీంద్రనగర్‌కు చెందిన మిథున్ కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం తన కుమారుడిని మిథున్ పాఠశాల బస్సు ఎక్కించడానికి వచ్చాడు. ఈ క్రమంలో మిథున్ కుమార్తె జావ్లానా (2) తన తండ్రి, అమ్మమ్మతో కలిసి బస్సు వద్దకు వచ్చింది. పాఠశాల బస్సు డ్రైవర్‌తో మిథున్ మాట్లాడుతుండగా అమ్మమ్మతో ఉన్న చిన్నారి జావ్లానా నాన్న వద్దకు వెళ్తానంటూ పరిగెత్తి వెళ్లింది. ఈ సమయంలోనే డ్రైవర్ బస్సును ముందుకు తీయడంతో టైరు కిందపడి పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే పాప మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News