హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో 17 ఏళ్ల క్రితం ప్రారంభమైన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన 17 నిమిషాలు గల సన్నివేశాలను విజయదశమి సందర్భంగా ఈనెల 24న డిజిటల్ ఫ్లాట్ఫామ్లో విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను బాలకృష్ణ అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబులు నటించారు. ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నర్తనశాల’ను బాలయ్య స్వీయ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో కొన్ని సన్నివేశాల చిత్రీకరించారు. అయితే, ఈ సమయంలోనే హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో ‘నర్తనశాల’ అర్థాంతరంగా ఆగిపోయింది.
Balakrishna’s Narthanasala movie Trailer Released