Tuesday, May 7, 2024

కెసిఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా ఖమ్మం: బండి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: అవినీతిపరుల గుండెల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చిచ్చర పిడుగు అని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం వేదికగా బిజెపి ఎన్నికల శంఖారావం పూరించింది. రైతు గోస-బిజెపి భరోసా పేరిట జరిగిన బహిరంగ సభలో ఎంపి బండి సంజయ్ ప్రసంగించారు. సిఎం కెసిఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా ఖమ్మం జిల్లా అని, కెసిఆర్ మళ్లీ మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, కెసిఆర్‌కు ఎన్నికలు వస్తేనే హామీలు గుర్తుకు వస్తాయని బండి ఎద్దేవా చేశారు. కెసిఆర్, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు.

Also Read: కారుతో డాక్టర్ ను ఢీకొట్టి… బానెట్‌పై 50 మీటర్లు లాక్కెళ్లి (వీడియో వైరల్ )

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News