Saturday, May 11, 2024

సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్ లేఖ

- Advertisement -
- Advertisement -

Bandi Sanjay Letter to CM KCR

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి లేఖ రాశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ విషయంపై ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారని నిలదీశారు. అందులో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ హామీని లేఖలో ప్రస్తావించారు. సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.5 నుంచి 6 లక్షల ఆర్థిక సాయం మాట ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఒక్కరైనా లబ్దిదారులు ఉన్నారా? అని అడిగారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 91 వేల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసిందన్న బండి సంజయ్.. ఎన్ని ఇళ్లు పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారని మండిపడ్డారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని పూర్తి చేశారని బండి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News