Sunday, April 28, 2024

అరలక్ష దాటిన బిసి దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -
పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ ప్రక్రియ
బిసి హాస్టల్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ వెబ్ సైట్‌ను ప్రారంబించిన మంత్రి గంగుల
బిసి సంక్షేమ శాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న బిసి వర్గాల కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం ఇప్పటివరకూ దాదాపు 53 వేలు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో మంతిర ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కులవృత్తులకు ఘన వైభవంతెచ్చి వారి జీవితాలను మెరుగుపరుచడమే ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పమని, వారి కులవృత్తికి ఉపయోగపడే ముడిసరుకు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు గానూ ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం చేస్తుందన్నారు. ఈనెల 20 వరకూ పథకానికి సంపూర్ణంగా ఆన్‌లైన్ ద్వారానే https://tsobmms.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని దరఖాస్తుదారులకు మరోసారి సూచించారు, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరినీ ప్రత్యక్షంగా కలువాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆదాయ ధృవీకరణ పత్రాలు 2021 ఎప్రిల్ నుండి జారీ చేసినవి చెల్లుబాటవుతాయని చెప్పారు. జిల్లా కలెక్టర్లు అవసరార్థుల ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చాలా సరళంగా ఉన్న అప్లికేషన్ ఫారంను దరఖాస్తుదారులు తమ స్మార్ట్ ఫోన్ల నుండి సమర్పించవచ్చన్నారు.

బిసి హాస్టల్స్ అడ్మిషన్లకు ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం
రాష్ట్రంలోని 703 బిసి ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సీట్లను ఇకనుండి ఆన్‌లైన్ ద్వారానే భర్తీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందుకు సంబందించిన వ్బ్సైట్ https://bchostels.cgg.gov.in ను సచివాలయంలో మంత్రి అధికారికంగా ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం నుండే దీన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. వెబ్‌సైట్‌లో సూచించిన ఆన్‌లైన్ అడ్మిషన్ ఫామ్ నింపి దరఖాస్తు సమర్పించగానే ఎవరి ప్రమేయం లేకుండా వివరాలు వెరిఫికేషన్ చేసుకొని ప్రవేశానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, టాడీ టాపర్స్ కార్పోరేషన్ ఛైర్మన్ పల్లె రవి, బిసి సంక్షేమ శాఖ డిడి సంధ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

BC1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News