Friday, May 3, 2024

వార్డు కోసం అందం పందెం

- Advertisement -
- Advertisement -

Beauty queen Diksha Singh to contest UP panchayat poll

లక్నో : ఇప్పుడు అందరి కళ్లూ ఉత్తరప్రదేశ్‌లో జరిగే పంచాయతీ పోరుపైనే పడ్డాయి. జౌన్పూర్ జిల్లా బక్షా బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో 26వ వార్డు నుంచి మోడల్, అందాలరాణి దీక్షా సింగ్ పోటీకి దిగుతున్నారు. 2015 మిస్ ఇండియా పోటీల్లో దీక్షా పోటీదారుగా ఉన్నారు. పలు యాడ్స్, ప్రైవేటు అల్బమ్స్‌ల్లో నటించారు. తండ్రి జితేంద్ర సింగ్ ఈ వార్డు నుంచి పోటీ చేయాలని అనుకుంటూ వచ్చారు. అయితే ఈ స్థానాన్ని మహిళలకు రిజర్వ్ చేయడంతో , ఇక్కడి నుంచి కూతురు పోటీ చేయాలని తండ్రి ఆదేశించారు. దీనితో దీక్షా ఈ స్థానంలో పోటికి సిద్ధం అయ్యారు. ఈ నెల 15వ తేదీన ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. తాను చదివింది మూడో తరగతి వరకూ అని, తమది చిట్టోరి గ్రామం అని, వ్యాపారాలలో ఉన్న తండ్రితో పాటు తాను ముంబై, గోవా తదితర ప్రాంతాలలో తిరిగానని, చిన్ననాటి నుంచి తనకు రాజకీయాలంటేఇష్టం అని చెప్పిన దీక్షా బిజెపి అభ్యర్థినితో తలపడుతున్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా జౌన్పూర్ ప్రాంతం ఎటువంటి అభివృద్థికి నోచుకోలేదని మిస్ ఇండియా మిస్ అయిన ఈ మిస్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News