- Advertisement -
న్యూఢిల్లీ: బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తమ రాష్ట్రంలోనికి వలస కార్మికుల రైళ్లను అనుమతించడంలేదని కే్రంద హోంశాఖమంత్రి అమిత్షా తెలిపారు. వలస కార్మికుల పట్ల బెంగాల్ ప్రభుత్వ నిర్ణయం అన్యాయమని ఆయన విమర్శించారు.
ఈమేరకు మమతాబెనర్జీకి లేఖ వ్రాసినట్టు అమిత్షా తెలిపారు. వలస కార్మికులు తమ సొంత స్థలాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారి కోసం ప్రత్యేక రైళ్లను కేంద్రం ఏర్పాటు చేసిందని, బెంగాల్ ప్రభుత్వం మాత్రం వారి చేరవేతకు సహకరించడంలేదని అమిత్షా తెలిపారు.
- Advertisement -