- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లిబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు అభినందించారు. కరోనా వైద్యసేవలో గాంధీ ఆసుపత్రి వైద్యులు దేశానికి ఆదర్శంగా నిలిచారని, వైద్యులు కనిపించే దేవుళ్లని ఆయన ట్విట్టర్లో అభినందించారు. తల్లిబిడ్డలకు కరోనా చికిత్స అందించి వారిని కాపాడటంతో కరోనాను పారద్రోలడంలో డాక్టర్లు మరో ముందడుగు వేశారని ఆయన ప్రశంసించారు.
- Advertisement -