Saturday, April 27, 2024

ఐటిడిఎ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు: భట్టి

- Advertisement -
- Advertisement -

సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం పాలకమండలి సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏ సమావేశాలు నిర్వహించకుండా వాటి ప్రధాన ఉద్దేశాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న గత బిఆర్ఎస్ ప్రభుత్వం.. ఐటిడిఏ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. గిరిజన కుటుంబాలకు మేలు జరిగే విధంగా పాలకమండలి సమావేశంలో సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. విద్య, వైద్యం, ఆశ్రమం, ఉపాధికి బాటలు వేసే విధంగా ఐటీడీఏ ప్రణాళికలు ఉండాలని చెప్పారు.

ఐటీడీఏ పరిధిలో గిరిజన జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే.. విద్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా అధికారుల ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం చెప్పారు. రెసిడెన్షియల్, ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు భట్టి.

పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఉన్నత చదువులు వెళ్లడానికి కావలసిన సహకారం, అవగాహన కల్పించాలన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలని…ఇంటర్ నుండి ఉన్నత చదువులకు వెళ్ళని విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని భట్టీ విక్రమార్క సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News