Monday, May 6, 2024

అదిగదిగో వృద్ధ భారతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశంలో వృద్ధుల జనాభా అ నూహ్యమైన రేటుతో వి స్తరిస్తోంది. ఈ శతాబ్దపు మధ్య నా టికి పిల్లల జనాభాను అధిగమిస్తుం దని కొత్త యూఎన్‌ఎఫ్‌పిఎ నివేదిక పేర్కొం ది. రాబోయే దశాబ్దాల్లో యువభారతం వేగం గా వృద్ధాప్య సమాజంగా మారుతుందని ఈ నివే దిక పేర్కొంది. రాబోయే దశాబ్దాల్లో యువభార తం వేగంగా వృద్ధాప్య సమాజంగా మారుతుందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచలో అత్యధిక కౌమార దశ, యువకులు ఉన్న దేశాల్లో భారత దేశం ఒకటి. జాతీయస్థాయిలో యూఎన్‌ఎఫ్‌పీఎ “ఇండియా ఏ జింగ్ రిపోర్టు 2023 ” ప్రకారం వృద్ధుల (60 + సం వత్సరాలు) జనాభా వాటా 2021 లో 10.1 శాతం నుండి 2036లో 15 శాతానికి పెరుగుతుందని అం చనా . “ శతాబ్ది చివరినాటికి దేశం లోని మొత్తం జనాభాలో వృద్ధులు 36 శాతానికి పైగా ఉంటారు. 2010 నుంచి వృద్ధుల జనాభా అధికంగా పెరుగు తూ వచ్చింది. అలాగే 15 సంవత్సరాల కంటే తక్కు వ వయస్సు ఉన్న వారిలో క్షీణత వేగాన్ని సూచిస్తుం ది. ఈ నేపథ్యంలో భారత దేశంలో వృద్ధాప్య సమా జం పెరుగుతుంది.” అని నివేదిక పేర్కొంది.

“2050 నాటికి నాలుగు సంవత్సరాల ముందు, భారత దేశం లోని వృద్ధుల జనాభా పరిమాణం 014 సంవత్సరా ల వయస్సు గల పిల్లల జనాభా పరిమాణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ సమయానికి ,1559 సం వత్సరాల జనాభా వాటా కూడా తగ్గుతుంది. నిస్సం దేహంగా, సాపేక్షంగా, యువ భారత దేశం రాబో యే దశాబ్దాలలో వేగంగా వృద్ధాప్య సమాజంగా మారుతుంది ” అని పేర్కొంది. దక్షిణ ప్రాంతం లోని చాలా రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు 2021లో జాతీయ సగటు కంటే వృద్ధుల జనాభాలో ఎక్కువ వాటాను కలిగి ఉంటా యి. ఈ అంతరం  2036 నాటికి పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి అధిక సంతానోత్పత్తి రేట్లు, జనాభా పరివర్తనలో వెనుకబడి ఉన్న రాష్ట్రాలు 2021-2036 మధ్య వృద్ధుల జనాభాలో పెరుగుదలను చూస్తాయని భావిస్తున్నప్పటికీ, ఈ స్థాయి భారతీయ సగటు కంటే తక్కువ గానే ఉంటుందని నివేదిక పేర్కొంది. 1961 నుంచి భారత దేశం వృద్ధుల జనాభాలో మధ్యస్థం నుంచి అధిక వృద్ధిని చూసింది. 2001 కంటే ముందు ఈ వేగం నెమ్మదిగా ఉంది.

అయితే రాబోయే దశాబ్దాల్లో అది గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. 2021 జనాభా అంచనాల ప్రకారం భారత దేశంలో ప్రతి 100 మంది పిల్లలకు 39 మంది వృద్ధులు ఉన్నారని నివేదిక పేర్కొంది. వృద్ధుల జనాభాలో ఎక్కువ వాటా ఉన్న రాష్ట్రాలు (దక్షిణ భారతదేశంలో ఉన్నవి) కూడా వృద్దాప్య సూచికకు అధిక స్కోరును చూపుతాయి. సంతానోత్పత్తి క్షీణతను సూచిస్తుంది. ఇది పిల్లలతో పోలిస్తే వృద్ధుల సంఖ్య పెరగడానికి దారి తీస్తుంది. “ దక్షిణ, పశ్చిమ భారత దేశంతో పోలిస్తే మధ్య, ఈశాన్య ప్రాంతాలు వృద్ధాప్య సూచిక ద్వారా సూచించిన యువరాష్ట్రాల సమూహాన్ని కలిగి ఉన్నాయి” అని ఈ నివేదిక తెలిపింది. వృద్ధాప్య సూచిక 100 మంది పిల్లల జనాభాకు (15 ఏళ్ల లోపు ) వృద్దుల (60 + సంవత్సరాలు) సంఖ్యను కొలుస్తుంది. జనాభా వయస్సు పెరిగే కొద్దీ ఇండెక్స్ స్కోర్ పెరుగుతుంది. జనాభా అంచనాలు 2021లో భారత దేశం లోని 100 మంది పనిచేసే వయస్సు వ్యక్తులకు 16 మంది వృద్ధులు ఉన్నారని, ప్రాంతాల వారీగా గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని యుఎన్‌ఎఫ్‌పిఎ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News