Saturday, May 4, 2024

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

at Devaruppala

బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

దేవరుప్పల: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర  జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేవరుప్పలలో బండి సంజయ్ మాట్లాడుతూ  కెసిఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు.
అయితే  అక్కడున్న కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు కేంద్రంలోని బిజెపి  ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు.  దాంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News