- Advertisement -
సూరజ్పూర్ : 60 ఏళ్ల బిజెపి కిసాన్ మోర్చా నేత శివచరణ్ కాశీ అదృశ్యమైన మూడు రోజుల తరువాత అతని ఛిద్రమైన శవం చత్తీస్గఢ్ అడవుల్లో కనిపించింది. సూరజ్పూర్ జిల్లా అడవుల్లో ఈ శవాన్ని మంగళవారం కనుగొన్నారు. శవం రెండు ముక్కలుగా కనిపించింది. భూతగాదా వల్లనే అతను హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. బీహార్పూర్ మండల కిసాన్మోర్చా అధ్యక్షుడైన కాశీ శనివారం రాత్రి నుంచి కనిపించక పోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆయనను ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానించారు. ఆరోజు రాత్రి తుపాకీ కాల్పులు వినిపించాయని చెప్పారు. గ్రామానికి చెందిన వ్యక్తే భూతగాదాపై హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
- Advertisement -