Saturday, April 27, 2024

ప్రపంచంలో ఎవ్వరూ పర్‌ఫెక్ట్‌గా ఉండరు: అనుష్క

- Advertisement -
- Advertisement -

డిప్రెషన్ కారణంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలిన నేపథ్యంలో.. హీరోయిన్ అనుష్క ఈ ఘటనపై స్పందించింది. సోషల్ మీడియా ద్వారా ఈ స్టార్ హీరోయిన్ డిప్రెషన్ నుండి బయటపడే మార్గాలను సూచించింది. “సెలెబ్రిటీ అయినా సామాన్యుడు అయిన కూడా కష్టాలు, కన్నీరు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ పరిస్థితుల నుండి బయట పడేందుకు ప్రయత్నించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ప్రపంచంలో ఎవ్వరూ  పర్‌ఫెక్ట్‌గా ఉండరు. ప్రతి ఒక్కరు కూడా కష్టాలను ఎదుర్కోవాల్సిందే.

జీవితంలో ఏం జరిగినా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి తప్ప జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవాలనే నిర్ణయం తీసుకోవడం తప్పు”అని అనుష్క పేర్కొంది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. “డిప్రెషన్‌లో ఉన్న సమయంలో ఇతరులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా మనకు ఇష్టమైన వారు, ఆనందాన్ని పంచే వారు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఎదుటి వారు ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే వారిని చూసీ చూడనట్లుగా వదిలేయకుండా వారితో సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. తోటివారు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లయితే వారిపై మానవత్వం ప్రదర్శించినప్పుడే వారు డిప్రెషన్ నుండి బయట పడగలరు”అని అనుష్క చెప్పింది.

Anushka Shetty Emotional Post a note on Sushant’s death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News