Saturday, May 4, 2024

యుపి పౌర ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

- Advertisement -
- Advertisement -
17 మేయర్లు, 1401 కార్పొరేటర్లను ఎన్నుకోడానికి మే4, 11 తేదీల్లో… రెండు దశల్లో పట్టణ స్థానిక ఎన్నికలు జరిగాయి.

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి శనివారం భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షమైన అప్పా దళ్(సోనేలాల్)సువార్, ఛన్‌బే స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో ఎన్నికల పనితీరు ప్రశంసించారు.
‘రాష్ట్రంలో సమర్ధవంతమైన పరిపాలన, అభివృద్ధి, భద్రత కారణంగానే పౌర ఎన్నికల్లో గెలుపు లభించిందని ఆదిత్యనాథ్ అన్నారు. ‘2017లో బిజెపి 60 సీట్లు గెలుపొందగా, ఈ ఏడాది పట్టణ స్థానిక ఎన్నికల్లో రెట్టింపు సీట్లు సాధించాం’ అని అన్నారు.
‘మా మిత్రపక్షం అప్నా దళ్(సోనేలాల్) సువార్, చన్బే ఉప ఎన్నికలు రెండింటిలోనూ విజయం సాధించి సమాజ్ వాదీ పార్టీని ఓడించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యుపి ప్రభుత్వం వారి అభివృద్ధి, భద్రత కోసం నిరంతరం కృషి చేస్తుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను’ అని యోగి అన్నారు.

అయోధ్య, ప్రయాగ్‌రాజ్, షాజహాన్‌నపుర్, అలీగఢ్, గోరఖ్‌పుర్, మొరాదాబాద్ మేయర్ సీట్లను బిజెపి గెలుచుకుంది. 17 మేయర్లు, 1401 కార్పొరేటర్లను ఎన్నుకోడానికి మే 4, 11 తేదీల్లో రెండు దశల్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 19 మంది కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

UP Civil elections

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News