Friday, April 26, 2024

చెరువులో పడి బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

Boy dead in Mylardevpally in Rangareddy

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవిపల్లి లో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం వెళ్లి చెరువులో నీట మునిగిన మైనర్ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. లక్ష్మీ గూడ రాజీవ్ గృహ కల్పకు చెందిన నలుగురు స్నేహితులతో కలసి సరదాగా ఈత కొట్టడానికి పక్కనే వున్న చెరువులోకి ఇబ్రాహీం వెళ్లారు. నలుగురు చెరువులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో బాలుడు జారిపడ్డాడు. చూస్తండగానే బాలుడు మునిగిపోయాడు. స్థానికుల సమాచారం తో ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్ దేవిపల్లి పోలీసులు రంగంలోకి దిగి గజ ఈతగాళ్ల సహాయంతో రెండు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఇబ్రాహీం మృతదేహం వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News