Saturday, May 4, 2024

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Bike accident

హైదరాబాద్: ఎమ్ జిబి ఎస్ బస్సు స్టెషన్ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులను లారీ బలి తీసుకుంది.  అతివేగంతో వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి లారీ కిందకు దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. లారీ చక్రాల కింద నలిగి ఇద్దరు యువకులు ప్రాణాలు విడిచారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు చాదర్ ఘాట్ కు చెందిన‌ మోసిన్ ఖాన్, ఫసీ ఖాన్ గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News