Sunday, April 28, 2024

విషాద ఘటన: పెళ్లికొడుకు మృతి.. కోమాలోకి పెళ్లికూతురు..

- Advertisement -
- Advertisement -

bridegroom died in Road Accident at Serilingampally

హైదరాబాద్: నగరంలోని శేరిలింగంపల్లిలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహమైన 24 గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమారుడు మృతి చెందాడు. పెళ్లి కుమారుడు శ్రీనివాస్ కారు నడుపుతుండగా శేరిలింగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోగా, తీవ్ర గాయాలు కావడంతో పెళ్లికూతురు కోమాలోకి వెళ్లింది. చెన్నైలో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన పెళ్లికూతురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

bridegroom died in Road Accident at Serilingampally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News