- Advertisement -
పంజ్షీర్లో తాలిబన్ల ఘాతుకం
కాబుల్: అఫ్ఘానిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలెహ్ సోదరుడు రోహుల్లా అజీజితోపాటు ఆయన కారు డ్రైవర్ను పంజ్షీర్లో తాలిబన్లు కాల్చిచంపారు. గురువారం రోహుల్లా అజీజి కారులో వెళుతుండగా ఒక చెక్పాయింట్ వద్ద కారును అడ్డగించిన తాలిబన్లు ఆయనతోపాటు కారు డ్రైవర్ను కాల్చివేసినట్లు అమ్రుల్లా సలెహ్ కుమారుడు షురేష్ సలెహ్ శనివారం తెలిపారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న తన బాబాయ్ ఆ సమయంలో ఎక్కడకు వెళుతున్నారో తనకు తెలియదని, ఆ ప్రాంతంలో ఫోన్లు కూడా పనిచేయడం లేదని షురేష్ తెలిపారు. పంజ్షీర్ ప్రావిన్సులో అమ్రుల్లా సలెహ్ సారథ్యంలో సైనిక బలగాలు తాలిబన్లకు వ్యతిరేకంగా మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్నాయి. అఫ్ఘాన్లో పంజ్షీర్ ప్రావిన్సు తప్ప మిగిలిన ప్రాంతమంతా తాలిబన్ల వశమైపోయింది.
- Advertisement -