Saturday, May 4, 2024

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ బోణీ

- Advertisement -
- Advertisement -

ఎగిరిన గులాబీ జెండా
తొమ్మిది గ్రామ పంచాయతీల్లో విజయబావుటా
పార్టీ శ్రేణుల్లో వెల్లివిరుస్తున్న నూతనోత్సాహం

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బిఆర్‌ఎస్‌కు మరాఠా గడ్డ పై తొలి విజయం లభించింది. మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు గె లుపొంది గులాబీ జెండాను ఎగరేశారు. ఈ గెలుపుతో మహారాష్ట్రలోని గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వాస్తవానికి బిఆర్‌ఎస్ గత రెండు నెలలుగా పార్టీ బలోపేతం కో సం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ తమ అదృష్టం పరీక్షించుకునేందు కు మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పో టీ చేసింది. తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో భండారా జిల్లాలో ఏకంగా 9 గ్రామ పంచాయతీలలో గులాబీ పార్టీ గెలుపొంది బోణీ కొట్టింది.

భండారా జిల్లాలోని 66 గ్రామ పంచాయతీలలో 20 గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడగా అందులో 9 గ్రామ పంచాయతీల్లో బిఆర్‌ఎస్ గెలిచి సత్తా చాటుకుంది. ఇప్పటివరకు ఆ జిల్లాలో వెలువడి న ఫలితాల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెండు గ్రామ పంచాయతీలను మాత్రమే గెలుచుకున్నా యి. అలాగే శరద్ పవర్ పార్టీ ఎన్‌సిపి ఒక గ్రా మ పంచాయతీలో విజయం సాధించింది. ఈ విజయంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లోకి ఎంటరైన బిఆర్‌ఎస్ పార్టీ మహారాష్ట్ర పైనే ప్రత్యే క దృష్టి పెట్టింది. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే మహారాష్ట్రంలో భారీ బహిరంగ సభలు కూ డా నిర్వహించింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిఆర్‌ఎస్ రంగం సిద్ధం చేస్తోంది. అంతే కాదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ కేడర్‌ను పెం చుకోవటం, కార్యకర్తలకు శిక్షణా కేంద్రాలను ఏ ర్పాటు చేయడం వంటి కార్యక్రమాలపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మరి న్ని విజయాలను అందుకుంటుందని, తెలంగా ణ గడ్డమీది లాగా మరాఠా గడ్డపై గులాబీ జెం డా సత్తా చాటుతుందని పార్టీ శ్రేణులు ఆశాభా వం కనబరుస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సంక్షేమాల ను చూసి అక్కడి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ప్రధానంగా దళిత బంధు, రైతు బంధు, ఉచిత విద్యుత్, సాగు నీరు వంటి పథకాలను తాము మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే అందిస్తామని సిఎం కెసిఆర్ చెబుతుండటంతో మహారాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News