Saturday, May 4, 2024

తెలంగాణ ఎన్నికల సమరానికి బిఆర్ఎస్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేయడానికి పార్టీ అధినేత సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రొ. జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్నికల కదనరంగంలోకి బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ అడుగుపెట్టారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…. కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందన్నారు. వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడలో మార్చామని ఆయన పేర్కొన్నారు. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగియని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News