Sunday, April 28, 2024

25 మందితో బిఎస్పీ మూడో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

ఇప్పటివరకు 88  స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

మన తెలంగాణ/ హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీఎస్పీ విడుదల చేసింది. శనివారం ఆ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ 25 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. రాజేంద్ర నగర్ అభ్యర్థిని మూడో జాబితాలో మార్చారు. మొదటి రాజేంద్రనగర్ ప్రొ.అన్వర్ ఖాన్‌కు ప్రకటించగా ప్రస్తుతం ఆయనకు అంబర్‌పేట్ టికెట్ కేటాయించారు. రాజేంద్రనగర్ అభ్యర్థిగా రాచమల్లు జయసింహను ప్రకటించారు. ఇప్పటి వరకు ఆపార్టీ రెండు లిస్టులో 63 మంది ప్రకటించగా, మూడో లిస్టులో 25 మందిని ప్రకటించడంతో మొత్తం 88 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 31 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
మూడవ విడత జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు:

మహేశ్వరం: కొత్త మనోహర్ రెడ్డి
చెన్నూర్ (ఎస్సీ): డా. దాసారపు శ్రీనివాస్
అదిలాబాద్: ఉయక ఇందిర
ఆర్మూర్: గండికోట రాజన్న
నిజామాబాద్ (రూరల్): మటమాల శేఖర్
బాల్కొండ: పల్లికొండ నర్సయ్య
కరీంనగర్: నల్లాల శ్రీనివాస్
హుస్నాబాద్: పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్
నర్సాపూర్: కుతాడి నర్సింహులు
సంగారెడ్డి: పల్పనూరి శేఖర్
మేడ్చల్: మల్లేపోగు విజయరాజు
కుత్బుల్లాపూర్ : మహ్మద్ లమ్రా అహ్మద్
ఎల్బీ నగర్ : గువ్వ సాయి రామకృష్ణ ముదిరాజ్
రాజేంద్రనగర్ : రాచమల్లు జయసింహ (రివైజ్డ్)
అంబర్ పేట్: ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్)
కార్వాన్ :ఆలేపు అంజయ్య
గోషామహల్:మహ్మద్ ఖైరుద్దీన్ అహ్మద్
నారాయణ్ పేట్:బొడిగెల శ్రీనివాస్
జడ్చర్ల:శివ వుల్కుందఖర్
అలంపూర్ (ఎస్సీ):మాకుల చెన్న కేశవరావు
పరకాల:అముధాలపల్లి నరేష్ గౌడ్
భూపాలపల్లి:గజ్జి జితేందర్ యాదవ్
ఖమ్మం:అయితగాని శ్రీనివాస్ గౌడ్
సత్తుపల్లి (ఎస్సీ): సీలం వెంకటేశ్వర రావు
నారాయణ్ ఖేడ్: మహ్మద్ అలాఉద్దీన్ పటేల్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News