- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : నగరంలో సిటీబస్సులను నడుపుతున్న అధికారులు మరో అడుగు ముందుకేసారు. దానిలోభాగంగా కరోనా ప్రభావంతో మార్చి 19న నుంచిమూసివేసిన బస్పాస్ కౌంటర్లను శనివారం నుంచి తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్టిసికి ప్రధాన ఆదాయమార్గమైన జనరల్ బస్పాస్లు సుమారు 3 లక్షలకు పైగా ఉన్నాయి. ఇప్పటికే బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చిన అధికారులు రేతిఫిల్, ఈసిఐఎల్, ఉప్పల్, దిల్సుక్నగర్, మెహదీపట్నం, సిబిఎస్టర్మినల్, పటాన్చెరు, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లిహౌజింగ్బోర్డు,మేడ్చెల్,శంషాబాద్, అఫ్జల్గంజ్,వనస్థలిపురం,హయత్నగర్ ప్రాంతాల్లోబస్పాస్ కౌంటర్లను శనివారం నుంచి ప్రయాణికుల సౌకర్యం కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికులు తమ బస్పాస్లను తిరిగి రెన్యువల్ చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
- Advertisement -