Friday, April 26, 2024

పివి ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం…. కారు దగ్ధం

- Advertisement -
- Advertisement -

Car burn in PVNR Flyover accident

రంగారెడ్డి: రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో కారు లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మహిళను మరో వాహనదారుడు కాపాడాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. రాజేంద్ర నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News