Saturday, April 27, 2024

హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఎన్‌టిఆర్ పార్కు వద్ద ఆదివారం కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నితీన్, కార్తీక్, స్పత్రిక్ అనే యువకులు కారులో టిఫిన్ తినడానికి ఖైరతాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్ వెళ్తున్నారు. ఎన్‌టిఆర్ పార్కు వద్ద కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి గ్రిల్స్ ఢీకొట్టి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. లేక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న ముగ్గురు యువకులు గాయపడడంతో యశోదా ఆస్పత్రికి తరలించారు. ఆ కారులో నాలుగు రోజుల క్రితమే కొన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News