Saturday, September 21, 2024

ఆ పని చేస్తున్నాడని కుమారుడిని చితకబాదిన తండ్రి.. కేసు నమోదు

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్: ఇరుగుపొరుగు ఓ బాలుడు అల్లరి చేస్తున్నాడని చెప్పడంతో కన్నతండ్రి అతడిని చితక బాదాడు. ఈ వీడియో ఇరుగుపొరుగు వారికి పంపించడంతో తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లాల్‌దర్వాజ్‌లోని నాగం కంప్లెక్స్‌లో ఆశోక్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. బతుకు దెరువు కోసం కర్నాటక నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. కుమారుడు ఎక్కువగా అల్లరి చేస్తున్నాడని పలుమార్లు తండ్రికి ఇరుపొరుగు చెప్పారు. దీంతో సహనం కోల్పోయిన తండ్రి కుమారుడిని చితక బాదుతుండగా అతడి కూతురు వీడియో తీసింది. ఈ వీడియోను అతడు ఇరుగుపొరుగు వారికి వాట్సప్‌లో పంపించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అతడి భార్య ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News