Sunday, May 12, 2024

వైఎస్‌ఆర్‌టిపి నాయకులపై కేసులు

- Advertisement -
- Advertisement -

Cases against YSRTP leaders

మంత్రుల నివాసం వద్ద ఆందోళన చేసిన నాయకులు

మనతెలంగాణ, హైదరాబాద్ : మంత్రుల నివాసం వద్ద ఆందోళన చేసిన వైఎస్‌ఆర్‌టిపి నాయకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు మంత్రుల నివాసం వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. వైఎస్‌ఆర్ టిపి యూత్ అధ్యక్షుడు గడ్డం ఇందుజా రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. కొద్ది సేపటి తర్వాత వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించిన వారిపై ఐపిసి 341,188,290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News