మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీస్ కస్టడీ నుంచి పారిపోయిన దొంగను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శంకర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. దారిదోపిడీలు చేస్తున్న ఆరుగురు అంతరాష్ట్ర దొంగలను శంషాబాద్ ఎస్ఓటి, శంకర్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి నిందితులను గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే నిందితులను రిమాండ్కు తరలించేందుకు శంకర్పల్లి పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున జైలుకు తరలిస్తుండగా ప్రధాన నిందితుడు హర్షద్ ఖాన్(22) మూత్రవిసర్జన కోసం వాహనం నుంచి దిగాడు. ఇది అదునుగా భావించిన నిందితుడు పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. ఒక్కసారిగా షాక్గురైన పోలీసులు వెంటనే గాలింపు చేపట్టారు. స్థానికుల సాయంతో ఎట్టకేలకు ఫతేపూర్లో నిందితుడిని పట్టుకున్నారు. వెంటనే నిందితుడిని శంకర్పల్లి పోలీస్ స్టేషన్కు భారీ బందోబస్తు మధ్య తరలించారు.