Tuesday, May 7, 2024

22న ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు సగం పనిదినంగా ప్రకటిచింది. ఇది కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆఫీస్‌లన్నింటికీ వర్తిస్తుందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసివేయబడతాయి. వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యోగుల వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం సగం పనిదినంపై ప్రకటన చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News