Thursday, May 2, 2024

ఈనెల25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో విమాన సర్వీసులు పున:ప్రారంభం కానున్నాయి. ఈనెల 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు నడపనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విమానయాన సంస్థలు, ప్రయాణికులకు కేంద్రం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో విదేశీ, దేశీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనాను కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కేంద్రం.. రెండో విడుత లాక్ డౌన్ తర్వాత కొన్ని సడలింపులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో విడుత లాక్ డౌన్ సడలింపులో కేంద్రం ప్రజా రవాణా అనుమతిచ్చింది. తాజాగా దేశీయ విమానాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Central Govt Permission to Domestic Flights to Resume

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News