Friday, May 3, 2024

మొబైల్ ఫోన్ల స్నాచర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Central Zone Task Force police arrested two for stealing Mobile phones

మనతెలంగాణ, హైదరాబాద్ : మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని తిలక్‌నగర్, ఇందిరా నగర్‌కు చెందిన తిరుపతయ్య ఫ్లవర్ డెకరేషన్ పనిచేస్తున్నాడు, నల్లకుంటకు చెందిన కడారి ధరణీరాజ్ నిరుద్యోగి. ఇద్దరు బంధువులు అవుతారు. చదువు మధ్యలో ఆపివేసిన ఇద్దరు వ్యసనాలకు బానిసలుగామారారు, రోజు మద్యం తాగేవారు. డబ్బులు లేకపోవడంతో మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు. వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో మద్యం తాగుతున్నారు. విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో నిందితులను పట్టుకున్నారు. నిందితులపై నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ ఎండి అబ్దుల్ జావీద్, ఎస్సై శ్రీనివాసులు, శ్రీధర్ తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News