Tuesday, April 30, 2024

పారాబాయిల్ బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల
పారాబాయిల్ బియ్యం సేకరణకు ఆమోదం
ఆదేశాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
పీయుష్ గోయల్‌కు ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: 2023-24 ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్ రైస్ సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు గానూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ధన్యవాదములు తెలియజేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం కారణంగా తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనీస మద్దతు ధరను, రాష్ట్ర ప్రభుత్వం హామీగా ఇచ్చిన రూ. 500 బోనస్ ను చెల్లించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి వరిధాన్యాన్ని వెంటనే సేకరిం చాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు లబ్ధి చేకూరేందుకు వీలున్న అన్ని మార్గాల్లో కేంద్ర ప్రభుత్వం తనవంతు కృషిచేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News