Tuesday, May 7, 2024

బిజెపి మాజీ ఎంపి, ప్రముఖ జర్నలిస్టు చందన్ మిత్ర కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Chandan Mitra Ex-BJP MP and Journalist Dies

 

న్యూఢిల్లీ: బిజెపి మాజీ ఎంపి, ప్రముఖ జర్నలిస్టు చందన్ మిత్ర కన్నుమూశారు. 65 సంవత్సరాల చందన్ మిత్ర గతంలో పయనీర్ ఆంగ్ల దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. తన తండ్రి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి కన్నుమూశారని మిత్ర కుమారుడు కుషన్ మిత్ర గురువారం ట్వీట్ చేశారు. కాగా..చందన్ మిత్ర మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. మేధావిగా, దార్శనికునిగా చందన్ మిత్ర మీడియాతోపాటు రాజకీయాలలో గొప్పగా రాణించారని ప్రధాని పేర్కొంటూ ట్వీట్ చేశారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీకి సన్నిహితునిగా పేరున్న చందన్ మిత్ర గతంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. చందన్ మిత్రతో తన సన్నిహిత అనుబంధాన్ని బిజెపి ఎంపి స్వపన్ దాస్‌గుప్తా గుర్తు చేసుకుంటూ 1972 నాటి తమ స్కూల్ పిక్నిక్ ఫోటోను జత చేస్తూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News