- Advertisement -
అమరావతి: త్వరలో విశాఖలో పర్యటించి తీరుతానని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ఎన్నిసార్లు ఆపగలుగుతారో చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో శుక్రవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, గురువారం జరిగిన పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించారు. అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించడమేంటి అని ప్రశ్నించారు. కాన్వాయ్ పై దాడికి దిగిన వారిపై పోలీసులు ఎందుకు కేసులుపెట్టలేదన్నారు. వైసిపి కార్యకర్తలు పోలీసుల సహకారం లేకుండా ఎయిర్ పోర్ట్ కి ఎలా రాగలిగారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు తీరుపై గవర్నర్ ఫిర్యాదు చేయడంతో పాటు దీనిపై కోర్టుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
Chandrababu says I will definitely tour Visakhapatnam
- Advertisement -