మూడు గోపురాలు
ఎత్తు 161 అడుగులు
మెట్ల వెడల్పు 16 అడుగులు
నిలువు వరుసల సంఖ్య 366
నిర్మాణానికి ఆరులక్షల క్యూబిక్ అడుగుల శాండ్స్టోన్ వినియోగం
ఆగస్టు 5న భూమిపూజ
200మంది అతిథుల సమక్షంలో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన
ఆలయ వాస్తు శిల్పి : చంద్రకాంత్ సోంపురా, ఆర్కిటెక్ట్ : ఆశిష్
నిర్మాణ సంస్థ : లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్&టి)
అయోధ్యలో నిర్మించబోయే రామాలయానికి సంబంధించిన డిజైన్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు వైరల్ అవుతున్న రామాయాలనికి సంబంధించిన చిత్రాలతో తాజా డిజైన్ను పోల్చితే పూర్తిగా రూపమే మారిపోయింది. మరింత విశాలంగా రామాలయాన్ని నిర్మించనున్నారు. దీన్ని వాస్తు శిల్పి చంద్రకాంత్ సోపురా రూపొందించారు. ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల సిఎంలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం.
Changes in Ayodhya temple design